Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోటు ఎక్కువా?... నాలుగు రూ.500 నోట్లు ఎక్కువా: అమితాబ్ బచ్చన్

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (14:39 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గత ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును బౌండరీ విధానం ద్వారా విజేతగా ఎంపిక చేయడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యంగ్యాస్త్రం సంధించారు. రూ.2 వేలు ఎక్కువా? లేదా నాలుగు రూ.500 నోట్లు ఎక్కువా? అని ప్రశ్నించారు. ఇపుడు ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల పరిస్థితి అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 
 
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహిస్తే అది కూడా టైగానే ముగిసింది. అయినా బౌండరీ విధానం ద్వారా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించింది. మ‌రి అందుకు కార‌ణం ఏమంటే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎక్కువ బౌండ్రీలు కొట్టింది అని తేల్చారు. ఈ విచిత్ర నిబంధ‌న‌పై క్రీడా విశ్లేష‌కులు, అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మండిప‌డుతున్నారు. 
 
తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కాస్త విభిన్నంగా స్పందించారు. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌లు ఉంటే, నా ద‌గ్గ‌ర 2000 రూపాయ‌లు ఉన్నాయి. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌ల నోటు ఒక‌టి ఉంటే, నా ద‌గ్గ‌ర 500 రూపాయ‌ల నోట్లు నాలుగు ఉన్నాయి. మ‌రి ఎవ‌రు ధ‌న‌వంతులు అంటే? 
 
రూ.500 నోట్లు నాలుగు ఉన్నోడే గొప్పోడు అని ఐసీసీ అంటుంద‌ని మెగాస్టార్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక కొద్ది సేప‌టి క్రితం త‌న ఫ్రెండ్ పీయూష్ పాండే ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ పెట్టిన హెడ్‌లైన్‌ని నాకు ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ విజ‌యం ఓవ‌ర్‌త్రోతో సాధ్య‌మైందని త‌న ట్వీట్‌లో తెలిపారంటూ బిగ్ బీ పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments