Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందుకే ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించలేదు : రవిశాస్త్రి

అందుకే ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించలేదు : రవిశాస్త్రి
, ఆదివారం, 14 జులై 2019 (15:55 IST)
మహేంద్ర సింగ్ ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించకపోవడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ముఖ్యంగా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన సమయంలో ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించకుండా ఏడో స్థానంలో దించడంపై పలువురు క్రికెటర్లు మండిపడుతున్నారు. 
 
దీనిపై కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ, ఎంతో అనుభవమున్న ధోనీ చివరి ఓవర్లలో క్రీజులో ఉండటం అవసరమని, ఇది సమిష్టి నిర్ణయమని చెప్పారు. 'ఇది టీమ్ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక ప్రతి ఒక్కరు ఉన్నారు. వాస్తవానికి ఇది చాలా చిన్న నిర్ణయం. ధోనీ ముందుగానే బ్యాటింగ్ కు వచ్చి, ఔటైపోతే... అది గెలిచే అవకాశాలను దారుణంగా దెబ్బ తీస్తుంది. అతని అనుభవం చివరి ఓవర్లలో చాలా కీలకం. క్రికెట్ చరిత్రలో అత్యున్నత ఫినిషర్ అయిన ధోనీని చివరి ఓవర్లలో ఆడించకపోవడం పెద్ద తప్పే అవుతుంది' అని చెప్పాడు.
 
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇదిలావుండగా, రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ను బీసీసీఐ మరో 45 రోజుల పాటు పొడిగించింది. ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రిలు బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జట్టు ఓటమిపై సమీక్షను నిర్వహించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ కప్ ఫైనల్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్