Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్తాక్ అలీ ట్రోఫీ.. శ్రేయాస్ అయ్యర్ అదుర్స్.. 7 ఫోర్లు, 15 సిక్సర్లతో రికార్డ్

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:16 IST)
ఇండోర్‌లో జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రోజున సిక్కింతో జరిగిన టీ20లో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. తన బ్యాటుకు పనిపెట్టి 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్లు సాధించాడు. ఫలితంగా 147 పరుగులు చేసి భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 
 
ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిషభ్ పంత్ (128)ను అయ్యర్ అధిగమించి రికార్డు బద్ధలు కొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ విజృంభణతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 104 పరుగులకే కుప్పకూలి ఓటమిని చవిచూసింది. 
 
అంతకుముందు ఇదే ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా కేవలం 61 బంతుల్లోనే అజేయ శతకం బాదేశాడు. అంతేగాక దేశవాళీ టీ20లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. గ్రూప్‌-సిలో భాగంగా సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రైల్వేస్‌జట్టు ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులుండగానే గెలుపును నమోదు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments