Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్తాక్ అలీ ట్రోఫీ.. శ్రేయాస్ అయ్యర్ అదుర్స్.. 7 ఫోర్లు, 15 సిక్సర్లతో రికార్డ్

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:16 IST)
ఇండోర్‌లో జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రోజున సిక్కింతో జరిగిన టీ20లో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. తన బ్యాటుకు పనిపెట్టి 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్లు సాధించాడు. ఫలితంగా 147 పరుగులు చేసి భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 
 
ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిషభ్ పంత్ (128)ను అయ్యర్ అధిగమించి రికార్డు బద్ధలు కొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ విజృంభణతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 104 పరుగులకే కుప్పకూలి ఓటమిని చవిచూసింది. 
 
అంతకుముందు ఇదే ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా కేవలం 61 బంతుల్లోనే అజేయ శతకం బాదేశాడు. అంతేగాక దేశవాళీ టీ20లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. గ్రూప్‌-సిలో భాగంగా సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రైల్వేస్‌జట్టు ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులుండగానే గెలుపును నమోదు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments