Webdunia - Bharat's app for daily news and videos

Install App

రో"హిట్".. 'సరిలేరు నీకెవ్వరు'...

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:35 IST)
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ టోర్నీలో విశ్వవిజేతగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. అయితే, భారత ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం అద్భుతంగా రాణించాడు. ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. ఒకే టోర్నీలో ఐదు సెంచరీలు, ఓ అర్థ సెంచరీలతో 648 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. పైగా, రోహిత్ శర్మ సగటు 81 శాతంగా ఉంది. 
 
అయితే, క్రికెట్ వరల్డ్ కప్ తన ట్విట్టర్‌ పేజీలో టాప్‌-5 స్పెషల్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్‌ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా), మూడోస్థానంలో షకీబుల్‌ హసన్‌ (బంగ్లాదేశ్), నాలుగో స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్), ఐదో స్థానంలో జోయి రూట్‌ (ఇంగ్లండ్)లు ఉన్నారు. 
 
ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్‌ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్‌ వార్నర్‌ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్‌ తరపున అద్భుతంగా ఆడిన షకీబుల్ హసన్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్ 578 పరుగులతో నాల్గో స్థానంలో, జూ రూట్ 556 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments