Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్ : 5 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు.. సెమీస్‌కు కివీస్!!

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (20:43 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, గురువారం బెంగుళూరు వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 5 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 23.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో పది పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు సెమీస్‌లోకి అడుగుపెట్టే తొలి నాలుగు జట్ల జాబితాలో కివీస్ ఉంది. అయితే, ఇతర జట్ల జయాపజయాలపై ఈ చిత్రం సెమీస్ ఆశలు ఆధారపడివున్నాయి. 
 
ఈ మ్యాచ్‍‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 23.2 ఓవర్లలోనే లక్ష్యానికి చేరుకుంది. కివీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు డెవాన్ కాన్వే 45, రచిన్ రవీంద్ర 42లు రాణించి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. 
 
ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ 14 పరుగులు చేసి విఫలమైనప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్ 46 పరుగులు చేశారు. మిగిలిన మ్యాచ్‌ను గ్లెన్ ఫిలిప్స్ 17, టామ్ లాథమ్ 2 పరుగులు చేసి పూర్తి చేశారు. శ్రీలంక బౌలర్లలో ఏజెంలో మ్యాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ ప్రస్తుతం 9 మ్యాచ్‌లు ఆడ 5 విజయాలతో 10 పాయింట్లు అందుకుంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ఒకవేళ ఆ రెండు జట్లు గెలిస్తే రన్‌ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతానికి న్యూజిలాండ్ రన్‌ రేట్ 0.922 కాగా, పాకిస్థాన్ రేన్‌ రేట్ 0.036 ఆప్ఘనిస్థాన్ రన్ రేట్ 0.038గా ఉంది. 
 
పాయింట్ల పట్టికలో భారత్ మొత్తం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటగా, ఆ తర్వాత 12 పాయింట్లతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పది పాయింట్లతో కివీస్ నాలుగో స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెల్ఫీ వీడియో కోసం వాటర్ ఫాల్స్‌‍లో దూకిన మాజీ ఆర్మీ జవాన్.. రెండు తర్వాత... (Video)

డెంగ్యూ జ్వరాన్ని పోలి వుండే జికా వైరస్.. గర్భిణీ మహిళలు జాగ్రత్త!

జూలై 6 నుంచి జూలై 19 వరకు పూరీ జగన్నాథుడి రథయాత్ర!!

ప్రజలు చిత్తుగా ఓడించినా సరే మూడు రాజధానులకే కట్టుబడివున్నాం : బొత్స సత్తిబాబు

బెంగళూరు: డెంగ్యూ జ్వరంతో 27 ఏళ్ల యువకుడి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

శ్రీరామ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో కోడి బుర్ర ప్రారంభం

ఆసక్తిగా మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది బ‌ర్త్‌డే బాయ్ టీజ‌ర్

తర్వాతి కథనం
Show comments