Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ప్రపంచ కప్ : నేడు శ్రీలంక వర్సెస్ కివీస్... దేవుడా... లంకేయుల చేతిలో కివీస్ ఓడిపోవాలి

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (11:46 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలని భారత్ క్రికెటర్లు మాత్రమేకాదు.. యావత్ క్రికెట్ ప్రపంచం కోరుకుంటుంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఆతిథ్య జట్టు భారత్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలించింది. తర్వాత స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం ఆప్ఘనిస్థాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం సెమీస్‌కు పాకిస్థాన్ జట్టు వస్తుంది. అపుడు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మరోమారు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఈ పోరాటాన్ని కనులారా వీక్షించేందుకు వీలుగా లంకేయులు చేతిలో కివీస్ ఆటగాళ్లు ఓడిపోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌‍లో కివీస్ జట్టు గెలిస్తే సెమీస్‌కు చేరుతుంది. 
 
ఇదిలావుంటే, పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. 8 పాయింట్లతో సమానంగా ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల నుంచి ఓ జట్టుతో సెమీస్‌లో తలపడుతుంది. మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఢీకొంటాయి. గురువారం శ్రీలంకపై విజయం సాధిస్తే న్యూజిలాండ్ (0.398) సెమీస్ చేరడం దాదాపుగా ఖాయం. ఎందుకంటే ఆ జట్టు రన్ రేట్ పాకిస్థాన్ (0.036), అప్ఘాన్ (-0.338) కంటే మెరుగ్గా ఉంది. ఒకవేళ శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా కివీస్‌కు అవకాశం ఉంటుంది. 
 
కానీ పాక్, ఆప్ఘాన్ తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఆప్ఘాన్ ముందుకు వెళ్లాలంటే దక్షిణాఫ్రికాపై నెగ్గాలి. పాక్, కివీస్ ఓడిపోవాలి. ఈ ముక్కోణపు రేసులో మిగతా రెండు జట్లతో పోలిస్తే పాకిస్థాన్ జట్టుకే కాస్త ప్రయోజనం ఉందనే చెప్పాలి. ఎందుకంటే కివీస్, ఆప్ఘాన్ మ్యాచ్‌ల తర్వాత పాక్ ఆడుతుంది. అప్పటికే సమీకరణాలపై పాక్‌కు పక్కాగా స్పష్టత వస్తుంది. ఒకవేళ నెట్ రన్ రేట్ పరిగణలోకి వస్తే ఎంత తేడాతో గెలవాలనేది కూడా ముందే తెలిసిపోతుంది.
 
ఈ టోర్నీలో పాకిస్థాన్ సెమీస్ చేరితే సెమీస్ వేదికలు మారనున్నాయి. నిజానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో వచ్చే బుధవారం వాంఖెడేలో సెమీస్ ఆడాల్సి ఉంది. కానీ ప్రత్యర్థిగా పాకిస్థాన్ వస్తే మాత్రం ఈ మ్యాచ్ ముంబైకి బదులు కోల్‌కతాలో జరుగుతుంది. షెడ్యూల్ ప్రకటించినప్పుడే ఐసీసీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మ్యాచ్‌ల కోసం ముంబై వెళ్లేందుకు పాకిస్థాన్ నిరాకరించడమే అందుకు కారణం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మరో సెమీస్ ముంబైలో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments