Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై జట్టుకు తొమ్మిదో "సారీ" : లక్నో జట్టుకు అపరాధం

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (10:39 IST)
ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు తొమ్మిదోసారి ఓటమి పాలైంది. అదేసమయంలో ఈ మ్యాచ్ గెలిచామన్న ఆనందం లక్నో జట్టుకు ఎంతో సేపు మిగలలేదు. ఆ జట్టు సభ్యులందరికీ ఐపీఎల్ రిఫరీ అపరాధం విధించి షాకిచ్చింది. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌‍కు రూ.24 లక్షల అపరాధం విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా మిగిలి జట్టు సభ్యులందరికీ కూడా కూడా ఫైన్ విధించారు. 
 
ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలోపు 20 ఓవర్ల బౌలింగ్‌ను లక్నో జట్టు పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా స్లో ఓవర్ రేటు కారణాన్ని చూపించి అపరాధం విధించారు. ఈ సీజన్‌లో లక్నో జట్టుకు ఇది రెండో విడత స్లో ఓవర్ రేటు. అందుకే భారీ మొత్తంలో అపరాధం విధించారు. 
 
అలాగే, ఈ మ్యాచ్‌ కోసం బరిలోకి దిగిన లక్నో జట్టు సభ్యులందరికీ కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు ఏది తక్కువైతే అది చెల్లించాలని రిఫరీ అదేశించారు. స్లో ఓవర్ రేట్ నిబంధన ఈ విడత చాలా మందికి షాకిస్తున్న విషయం తెల్సిందే. ఈ నిబంధనల మేరకు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు చివరి ఓవర్ 85వ నిమిషం ముగిసేలోపు తప్పనిసరిగా పూర్తిచేయాల్సివుంది. అంతకు ఆలస్యమైతే స్లో ఓవర్ రేటు కింద జరిమానా పడుతుంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments