Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ - కెప్టెన్‌గా రిషబ్ పంత్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (07:18 IST)
భారత, దక్షిణాఫ్రికా జట్లు మధ్య గురువారం నుంచి ట్వంటీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెట్ ప్రాక్టీస్‌లో కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరంగా కాగా, గజ్జల్లో గాయంతో కేఎల్ రాహుల్ బాధపడుతున్నారు. దీంతో వీరిద్దరూ జట్టుకు దూరమయ్యారు. 
 
ఫలితంగా భారత జట్టు పగ్గాలను కీపర్ రిషబ్ బంత్‌కు అప్పగించారు. అలాగే, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు ఇచ్చినట్టు బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేఎల్ రాహుల్‌కు కుడిపైపు గజ్జల్లో గాయమైందని, కుల్దీప్ యాదవ్‌కు నెట్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే చేతికి బంతి తగిలి గాయమైందని బీసీసీఐ తెలిపింది. 
 
భారత్ టీ20 జట్టు ఇదే.. 
రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments