Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో ఒక్కసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Advertiesment
coronavirus
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారి భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 5,233 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ కారణంగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఈ వైరస్ నుంచి 3,345 మంది కోలుకున్నారు. 
 
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. సోమవారం 4 వేలకు దిగువున ఉండగా, మంగళవారం ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరింది. అదేసమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇది ఆందోళనకు గురిచేస్తుంది. 
 
గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,13,361 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో 5,233 మందికి ఈ వైరస్ సోకింది. అంటే, సోమవారం 3,714 కేసులు నమోదు కాగా, మంగళవారం ఈ సంఖ్య 5,233గా ఉంది. అంటే పెరుగుదల శాతం 41 శాతానికి చేరింది. 
 
ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. కేరళలో 2,271, మహారాష్ట్రలో 1,881 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం 1,881 కేసుల్లో ఒక్క ముంబైలోనే 2,271 కేసులు నమోదు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీస్ కస్టడీకి సామూహిక అత్యాచార కేసు నిందితుడు