అభిషేక్ శర్మ వీర కుమ్ముడు : ముంబై టీ20లో భారత్ ఘన విజయం (Video)

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (22:08 IST)
ముంబై వేదికగా ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ వీర కుమ్ముడు ధాటికి ఇంగ్లీష్ బౌలర్లు చేతులెత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ 54 బంతుల్లో 13 సిక్సర్లు 7 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేశాడు. కేవలం 37 బంతుల్లోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20ల్లో రండో అత్యంత వేగవంతమైన సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు.  ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
 
అంతకుముందు టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ 16, తిలక్ వర్మ 24, శివమ్ దూబే 30, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు. శివమ్ దూబే 13 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సులతో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ ఉడ్ 2, జోఫ్రా ఆర్చర్ 1, జేమీ ఒవెర్టన్ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు.
 
అనంతరం, 248 పరుగుల భారీ లక్ష్యఛేదన ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ జట్టు 2 ఓవర్లలోనే 23 పరుగులు చేసింది. ఆ 23 పరుగులు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక్కడే కొట్టాడు. అయితే, మూడో ఓవర్లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బ్రేక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను షమీ అవుట్ చేయడంతో టీమిండియా శిబిరంలో ఉత్సాహం నెలకొంది. చివరకు 97 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments