Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ : మళ్లీ టాస్ ఓడిన భారత్... కివీస్ బ్యాటింగ్

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (14:51 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా, ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల ఫైనల్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ మరోమారు టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, టాస్ ఏదేనా తాము పట్టించుకోబోమన్నారు. 
 
గతంలోనూ తాము ఛేజింగ్ చేసి అన్ని మ్యాచ్‌లు గెలిచామని ఈ సందర్భంగా రోహిత్ గుర్తుచేశారు. అంతిమంగా ఎలా ఆడామన్నదే ముఖ్యమన్నారు. టాస్ ఎలా పడినా బాధపడొద్దని డ్రెసింగ్ రూమ్‌లోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
 
న్యూజిలాండ్ జట్టు గత కొన్నేళ్లుగా మెరుగైన ఆటతీరును కనబరుస్తోందని, ముఖ్యంగా, ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు నాణ్యమైన ఆట ఆడుతోందన్నారు. ఇపుడు అలాంటి టీమ్‌తో ఫైనల్ ఆడుతున్నామని, ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే, కివీస్ జట్టులో మాత్రం పేసర్ మాట్ హెన్రీ స్థానంల నాథన్ స్మిత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. 
 
దీంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ తొలి నాలుగు ఓవర్లలోనే 27 పరుగులు రాబట్టింది. ఓపెనర్లు యంగ్ 9, రచిన్ రవీంద్ర 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్ల విరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయాస్, అక్షర్ పటేల్, రాహుల్, పాండ్యా, జడేజా, షమీ, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి
 
న్యూజిలాండ్ : విలియమ్సన్, మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్‌వెల్, సాట్నర్, కైలే జెమిసన్, రూర్కే, నాథన్ స్మిత్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments