Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ పైన టీమిండియా ఘన విజయం: భారత్ విజయానికి, కోహ్లి సెంచరీకి కావలసింది 5 పరుగులే, కానీ...

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (00:31 IST)
ప్రపంచ కప్ 2023 క్రికెట్ పోటీల్లో టీమిండియా జైత్ర యాత్ర సాగుతోంది. న్యూజీలాండ్ జట్టు నడ్డి విరిచి నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐతే మొన్న బంగ్లాదేశ్ జట్టుపై విరాట్ కోహ్లి చేసిన ఫీట్ మరోసారి న్యూజీలాండ్ జట్టుపైన పునరావృతం అవుతుందని అంతా ఉగ్గబట్టుకుని ఎదురుచూసారు. విషయం ఏంటంటే... బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించడానికి మరో 2 పరుగులు అవసరమైన సమయంలో కోహ్లి సెంచరీ సాధించడానికి 3 పరుగులు కావల్సి వచ్చింది. ఆ సమయంలో కోహ్లి సిక్సర్ కొట్టడంతో అటు జట్టు విజయం ఇటు కోహ్లి సెంచరీ రెండూ ఒకేసారి జరిగాయి. ఇలాగే న్యూజీలాండ్ జట్టుతో తలబడిన కోహ్లికి అదే వరస వచ్చింది.

టీమిండియా విజయానికి 5 పరుగులు కావాలి, కోహ్లి సెంచరీ చేయడానికి కూడా 5 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి వున్నాడు. హెన్రీ వేసిన బంతిని భారీ షాట్ కొట్టాడు. ఐతే బౌండరీ లైన్ వద్ద వున్న ఫిలిప్స్ క్యాచ్ పట్టడంతో కోహ్లి సెంచరీ తృటిలో చేజారిపోయింది. దీనితో టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ వెంటనే జడేజా ఫోర్ కొట్టడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. 
 
274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాట్సమన్లు రోహిత్ శర్మ-శుభమన్ గిల్ 11.1 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్ శర్మ ఎప్పటిలాగే దూకుడుగా ఆడాడు. 40 బంతుల్లో 4x4, 4x6లతో 46 పరుగులు చేసాడు. దురదృష్టవశాత్తూ ఫెర్గూసన్ వేసిన బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తగలడంతో అది వికెట్లకు గిరాటేసింది. దీనితో రోహిత్ పెవిలియన్ దారిపట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి.. కివీస్ బౌలర్ల బౌలింగును కొద్దిసేపు ఆకళింపు చేసుకున్నాడు. పరుగులు తీయకుండా ఆచితూచి వ్యవహరించాడు. ఇంతలో 14వ ఓవర్లో గిల్ 26 పరుగుల వద్ద మళ్లీ ఫెర్గూసన్ బౌలింగులో ఔటవ్వడంతో న్యూజీలాండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments