Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : భారత్ ముంగిట 273 రన్స్ టార్గెట్

shami
, ఆదివారం, 22 అక్టోబరు 2023 (18:22 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు అహ్వానించింది. దీంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 273 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో మిచెల్ 130, రచిన రవీంద్ర 75 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలించారు. వీరిద్దరూ జట్టు ఇన్నింగ్స్‌ను పునర్మించారు. 
 
19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్ జట్టును రవీంద్ర - మిచెల్ జోడీ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. ఫలితంగా మూడో వికెట్‌ను కివీస్ జట్టు 178 పరుగుల వద్ద కోల్పోయింది. కివీస్ జట్టులో మిగిలిన ఆటగాళ్లలో కాన్వే, హెన్రీలు డకౌట్‌ కాగా, యంగ్ 17, లాథమ్ 5, ఫిలిప్స్ 23, చాంపన్ 6, సత్నర్ 1, ఫెర్గ్యూసన్‌లు 1 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, బుమ్రాలు ఒక్కో వికెట్ తీశారు. 
 
ఇదిలావుంటే, ప్రపంచ కప్‌లో భారత తరపున అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ల జాబితాలో మహ్మద్ షమీ మూడో స్థానంలో నిలిచాడు. ధర్మశాల వేదికగా జరిగిన కివీస్ మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్రపంచ కప్‌లో షమీ తీసిన వికెట్ల సంఖ్య 32కు చేరింది. తద్వారా భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 31 వికెట్ల ఫీట్‌ను అధికమించాడు. ఈ జాబితాలో జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ తలా 44 చొప్పున వికెట్లు తీశారు. ఇపుడు వీరిద్దరి తర్వాత షమీ చేఱాడు. జస్ప్రీత్ బుమ్రా 28 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్థానంలో నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ ప్రపంచ కప్ : కివీస్‌తో మ్యాచ్ - టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్