Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా అతిగా అంచనా వేసుకుంది.. తప్పులు చేసింది.. కుక్

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (17:04 IST)
Cook
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ముగిసింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది పోరులో న్యూజిలాండ్‌ విజేతగా నిలవగా.. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఓటమి పాలైంది. అయితే టీమిండియా ఓటమిపై ఇంకా విశ్లేషణ కొనసాగితోంది. టీమిండియా ఓటమికి గల కారణాలపై మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్‌ కుక్ కూడా టీమిండియా ఓటమిపై స్పందించాడు.
 
ఫైనల్లో టీమిండియా జట్టు ఎంపికలో తప్పులు చేసిందని కుక్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందని ముందే తెలిసినా టీమిండియా ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకుందని విమర్శించాడు. జట్టు ఎంపికపై భారత్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని, ముందుగానే జట్టును ప్రకటించిందని గుర్తు చేశాడు. టీమిండియా తమను తాము అతిగా అంచనా వేసుకుందని చెప్పాడు.
 
టీమిండియా గొప్ప జట్టు అని అన్న కుక్ … స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం టీమిండియా బలహీనత అని పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ కూడా లేకపోవడం టీమిండియా ఓటమికి కారణమని అభిప్రాయపడ్డాడు. అలానే న్యూజిలాండ్‌ విజయంపై కూడా అలిస్టర్‌ కుక్ స్పందించాడు. 
 
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ముందు ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టులు న్యూజిలాండ్‌కు ప్రాక్టీస్‌లా ఉపయోగపడ్డాయని తెలిపాడు. న్యూజిలాండ్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉంది కాబట్టే విజేతగా నిలిచిందని చెప్పాడు.

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments