ఆస్పత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త!!

ఠాగూర్
సోమవారం, 24 నవంబరు 2025 (14:58 IST)
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధానకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్‌ అనారోగ్యానిగి గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా, స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆదివారం మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌తో జరగాల్సిన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. 
 
ఆదివారం రాత్రి వరుడు పలాశ్‌ ముచ్చల్‌ కూడా అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వారి సన్నిహితులు వెల్లడించారు. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ కారణంగా పలాశ్‌ అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు వెల్లడించారు. చికిత్స అనంతరం అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 
 
కాగా ఆదివారం స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన సాంగ్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల కిందటే మంధాన వివాహ వేడుకలు మొదలయ్యాయి. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా ఆమె తండ్రి అనారోగ్యానికి గురవడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు మంధాన తెలిపారని ఆమె మేనేజర్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

తర్వాతి కథనం
Show comments