Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తి పేషెంట్‌కు ట్రీట్మెంట్ ఇస్తే..?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (14:27 IST)
కరోనా సోకకుండా వుండేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం చేస్తున్నారు. అలాగే కరోనా రోగులు అప్రమత్తంగా వుండాలని వైద్యులు చెప్తూ వుంటారు. కానీ వైద్యులకు కరోనా సోకితే ఐసోలేషన్‌లో వుంటూ చికిత్స తీసుకోవడం చేస్తారు. కానీ ఇక్కడో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కరోనా సోకినా.. అలానే పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బాచూపల్లిలోని ఎస్‌ఎల్‌జి ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఒక కరోనా రోగి వైద్యుల పొరపాటు కారణంగా ప్రాణాలు విడిచారు. దీనితో అతని కూతురు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తన తండ్రి మరణించాడని ఆయన కుమార్తె శ్వేత ఆరోపించింది. సుమారు 5 లక్షల వరకు బిల్లు వేసారు అని ఆమె మండిపడింది.
 
55వేల ఇంజక్షన్‌లతో పాటు రోజుకి 10 పీపీఈ కిట్లు ఇవ్వలన్నారని.. కానీ వెంటిలేటర్ పేషెంట్ వద్దకు వెళ్లిన సిబ్బంది అవి ఏమి ధరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా పాజిటివ్ ఉన్న డాక్టర్‌ ట్రీట్మెంట్ చేశారన్నారు. నడుచుకుంటూ వెళ్లిన తన తండ్రిని ఇంజెక్షన్‌లతో పడుకోపెట్టి ప్రస్తుతం గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments