Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:23 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా ఈ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ, సోమవారం నమోదైన కేసుల్లో ఏకంగా 45 శాతం పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏకంగా 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 94 వేలకు ఎగబాకింది. 
 
దేశ వ్యాప్తంగా మొత్తం 3.03 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 17,073 మందికి వైరస్ సోకిందని సోమవారం కేంద్రం వెల్లడించింది. దాంతో పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరి, ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మొత్తం దాదాపు 10 వేల కేసులొచ్చాయి. తమిళనాడులో వెయ్యి దాటగా ఢిల్లీలో రెండువేలకు చేరువయ్యాయి. 
 
తాజాగా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 94,420కి చేరాయి. క్రియాశీల కేసుల రేటు 0.22 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.57 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో 15,208 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికిపైగా కరోనా బారినపడగా 4.27 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. 5.25 లక్షల మందికి పైగా మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments