Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Advertiesment
coronavirus
, ఆదివారం, 26 జూన్ 2022 (10:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం 18 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కాదు. శనివారం ఈ సంఖ్య 15,940గా నమోదైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన గణాంకాల మేరకు కొత్తగా 11,779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,89,973కు చేరుకుంది. 
 
ఇందులో 4,27,72,398 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరో 92576 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 25 మంది చనిపోగా, 10917 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 3న బంగాళాఖాతంలో అల్పపీడనం