Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూలై నుంచి మొబైల్ మార్కెట్‌లోకి వన్ ప్లస్ 5జీ ఫోన్

oneplus
, శుక్రవారం, 24 జూన్ 2022 (16:43 IST)
మొబైల్ వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. జూలై ఒకటో తేదీ నుంచి వన్ ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్ ఫోనును అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఫోన్ 8జీ ర్యామ్, 128 జీపీ స్టోరేజ్ వేరియంట్, 12జీ ర్యామ్, 256 జీవీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ 5జీ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్‌లోకి జూలై ఒకటో తేదీ నుంచి విడుదలకానుంది. ఈ ఫోన్ విక్రయాలు జూలై 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు వేరియంట్లలో తయారు చేశారు. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.28,999, రూ.33,999గా నిర్ణయించినట్టు సమాచారం. 
 
అయితే, ఈ ధరల వివరాలను వన్ ప్లస్ కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సివుంది. ఇతర ఫోన్లను కొనుగోలు చేసినట్టుగానే వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఈకామర్స్ సైట్లలో బుక్ చేసుకోవాల్సివుంది. ఈ ఫోనును షాడో గ్రే, జేడ్ ఫాగ్ వంటి రంగుల్లో అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ అల్లర్లు - ప్రధాని మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చిన సిట్... సమర్థించిన సుప్రీం