Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీమిండియాలో సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ రీ ఎంట్రీ

surya kumar yadav
, శనివారం, 25 జూన్ 2022 (16:18 IST)
టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు స్ట్రోక్‌ ప్లేయర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌  సిద్ధమయ్యారు. ఐర్లాండ్‌తో ఆది, మంగళవారాల్లో జరిగే రెండు టీ20ల్లో ఈ ఇద్దరికీ తుది జట్టులో చోటు ఖాయమైనట్టు తెలుస్తోంది.
 
శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్ననేపథ్యంలో వీరి స్థానాల్లో సూర్య, సంజూ బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్‌ సందర్భంగా అయిన ముంజేయి గాయం నుంచి కోలుకున్న సూర్య తో పాటు టీ20 టీమ్‌లో ప్లేస్‌ ఖాయం చేసుకోవాలని చూస్తున్న శాంసన్‌ ఈ సిరీస్‌లో చెలరేగాలని చూస్తున్నాడు. 
 
సౌతాఫ్రికాతో టీ20ల్లో అవకాశం రాని 'జమ్మూ ఎక్స్‌ప్రెస్‌' ఉమ్రాన్‌ మాలిక్‌, యార్కర్ల స్పెషలిస్ట్‌ అర్షదీప్‌ సింగ్‌ ఈ సిరీస్‌తో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టే చాన్స్‌ కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెప్పులు అమ్ముకుంటున్న పాకిస్థాన్ అంపైర్