Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 ఏళ్లలో 44-మంది పిల్లలు- భర్త పారిపోయాడు.. ఉగాండా మహిళ కథ ఏంటంటే?

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:19 IST)
Uganda Woman
ఉగాండా మహిళ గురించి తెలిస్తే అందరూ షాకవుతారు. ఓ ఉగాండా మహిళ 40 ఏళ్లలోపు 44 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ఎక్కువమంది పిల్లలు పుట్టడంతో వారిని పోషించలేక భర్త పారిపోవడంతో వారందరినీ ఆమె ఒంటరిగా పెంచుతోంది. ఇప్పుడు ఆమె తన 38 మంది పిల్లలతో - 20 మంది కుమారులు మరియు 18 మంది కుమార్తెలతో నివసిస్తుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉగాండా నివాసి అయిన 43 ఏళ్ల మరియం నబటాంజీకి... 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పెళ్లి అయింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేసి విక్రయించారు. ఆమె 13 సంవత్సరాల వయస్సులో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అరుదైన పరిస్థితి కారణంగా ఒక్కో కాన్పులో నలుగురైదుగురు చొప్పున ఇప్పటివరకు 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. 
 
ఒక్కసారి మాత్రమే ఒక డెలివరీలో ఒక్క బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె 3 సంవత్సరాల క్రితం తన చివరి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే 44మందిలో ఆరుగురు పిల్లలు చనిపోయారు. 
 
అయితే ఒక్కో కాన్పులో సుమారు 2, 3 మరియు 4 పిల్లలకు జన్మనివ్వడం ప్రారంభించినప్పుడు, ఆమె ఆందోళన చెంది డాక్టర్ దగ్గరికి వెళ్లింది.
 
ఆమెకు విచిత్రమైన ఆరోగ్య పరిస్థితి ఉందని, దాని కారణంగా ఆమె చాలాసార్లు తల్లి అయినట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలింది. ఇతర మహిళలతో పోలిస్తే ఆమె అండాశయాలు అసాధారణంగా పెద్దవిగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెప్పారు. 
 
ఈ పరిస్థితిని హైపర్ అండోత్సర్గము అంటారు. గర్భనిరోధక పద్ధతులు ఆమెకు పని చేయవని వైద్యులు ఆమెకు చెప్పారు. ఈ కారణంగా, వారికి ఒకేసారి చాలా మంది పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments