దేశంలో కొత్తగా మరో 7 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (13:03 IST)
దేశంలో కొత్తగా మరో 7830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసులతో కలుపుకుంటే తాజాగా నమోదైన కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మొత్తం 7830 మందికి కరోనా వైరస్ సోకిందని తెలిపింది. దీంతో కలుపుకుంటే మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 40215కు చేరిందని వివరించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క ఢిల్లీలోనే అత్యధికంగా 980 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరిందని అధికారులు పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు. వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments