Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీపీఈ కిట్స్‌తో పెళ్లి చేసుకున్న వధూవరులు.. పండితుడు కూడా ఆ డ్రెస్‌లో..

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (12:19 IST)
కోవిడ్ వైరస్ జనాలకు చుక్కలు చూపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్‌కు దూరంగా వుంటూ తగిన జాగ్రత్తలను పాటిస్తూ ఆ జీవనశైలికి అలవాటు పడ్డారు. మాస్కులు ధరించడం, చేతులు మాటిమాటికీ శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం అనేవి మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలను జనాలు పరిమిత సంఖ్యలో అతిథులతో నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం వధువుకు ఏకంగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయినా వారు పెళ్లి చేసుకోవడం మానలేదు.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని షాబాద్ అనే ప్రాంతంలో వధువుకు కోవిడ్ సోకింది. దీంతో బారిలోని కోవిడ్ సెంటర్‌లో ఆమె చికిత్స పొందుతోంది. అయితే పెళ్లి ఉండడంతో వారికి ఒక దశలో ఏం చేయాలో తెలియలేదు. కానీ చివరకు వారు పీపీఈ కిట్లను ధరించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అదే పని చేశారు. పండితుడు కూడా పీపీఈ కిట్ ధరించి వారి వివాహం జరిపించాడు. ఈ వివాహంలో వధువు వరుడుతో పాటు వున్న ఇద్దరూ పీపీ కిట్ ధరించారు. అతిథులంతా మాస్కులతో ఆమడ దూరంలో నిలిచారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments