రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు.. ఒకే ఫ్యామిలీలో...

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (07:49 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 9 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒకేసారి ఇన్ని కేసులు వెలుగు చూడటంతో ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌, ఆదర్శ్ నగర్‌లో నివసించే ఓ కుటుంబ సభ్యులందరూ వారం రోజుల క్రితం సౌతాఫ్రికాకు వెళ్లి వచ్చారు. అయితే, కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో వీరందరికీ ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులే 9 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
దీంతో వీరిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో రాజస్థాన్ ప్రభుత్వం కర్ఫ్యూ తరహా పరిస్థితులను అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులతో కలుపుకుని దేశ వ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో ఏడు ఒమిక్రాన్ కేసులను గుర్తించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments