Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు.. ఒకే ఫ్యామిలీలో...

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (07:49 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 9 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒకేసారి ఇన్ని కేసులు వెలుగు చూడటంతో ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌, ఆదర్శ్ నగర్‌లో నివసించే ఓ కుటుంబ సభ్యులందరూ వారం రోజుల క్రితం సౌతాఫ్రికాకు వెళ్లి వచ్చారు. అయితే, కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో వీరందరికీ ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులే 9 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
దీంతో వీరిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో రాజస్థాన్ ప్రభుత్వం కర్ఫ్యూ తరహా పరిస్థితులను అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులతో కలుపుకుని దేశ వ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో ఏడు ఒమిక్రాన్ కేసులను గుర్తించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments