India Corona: అదుపులోనే మహమ్మారి.. కానీ పెరిగిన మృతుల సంఖ్య

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (23:14 IST)
దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ముందురోజు 13 వేలకు పడిపోయిన కేసులు.. తాజాగా 14,623కి చేరాయి. మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

 
మంగళవారం 13,23,702 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,623 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిన్న 19,446 మంది కోలుకున్నారు. 197 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 3.41 కోట్లకు చేరింది. అందులో 3.34 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 4,52,651 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098కి తగ్గింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది.

 
దేశంలో కరోనా టీకా కార్యక్రమం కీలక ఘట్టానికి చేరుకోనుంది. 100 కోట్ల డోసుల లక్ష్యం వైపు సాగుతోంది. ఇప్పటివరకు 99.12 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 41.36 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments