Webdunia - Bharat's app for daily news and videos

Install App

India Corona: అదుపులోనే మహమ్మారి.. కానీ పెరిగిన మృతుల సంఖ్య

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (23:14 IST)
దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ముందురోజు 13 వేలకు పడిపోయిన కేసులు.. తాజాగా 14,623కి చేరాయి. మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

 
మంగళవారం 13,23,702 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,623 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిన్న 19,446 మంది కోలుకున్నారు. 197 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 3.41 కోట్లకు చేరింది. అందులో 3.34 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 4,52,651 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098కి తగ్గింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది.

 
దేశంలో కరోనా టీకా కార్యక్రమం కీలక ఘట్టానికి చేరుకోనుంది. 100 కోట్ల డోసుల లక్ష్యం వైపు సాగుతోంది. ఇప్పటివరకు 99.12 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 41.36 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments