Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో 15 వేల దిగువకు చేరుకున్న పాజిటివ్ కేసులు

Advertiesment
దేశంలో 15 వేల దిగువకు చేరుకున్న పాజిటివ్ కేసులు
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (10:21 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్తగా 14,146 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, క‌రోనా నుంచి 19,788 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల నిన్న‌ 144  మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,40,67,719 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. చాలా రోజుల తర్వాత 15 వేలకు దిగువున ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,95,846 మందికి చికిత్స అందుతోంది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,19,749 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 4,52,124 గా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 41,20,772 డోసుల‌ క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 97,65,89,540కు చేరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడియో తీసిన వ్యక్తిని రావణుడితో పోల్చిన బీజేపీ ఎంపీ