Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళలో 6676 కరోనా కేసులు - దేశంలో 13 వేల పాజిటివ్ కేసులు

కేరళలో 6676 కరోనా కేసులు - దేశంలో 13 వేల పాజిటివ్ కేసులు
, మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:23 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు వెలుగుచూశాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కొత్త కేసులు 231 రోజుల కనిష్ట స్థాయిలో న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. అలాగే, 19,470 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.
 
ఇకపోతే, నిన్న క‌రోనాతో 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,52,454కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య‌ 3,40,94,373కు పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 227 రోజు క‌నిష్టానికి చేరింది. ప్ర‌స్తుతం 1,83,118 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,58,801 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం 98,67,69,411 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న‌ 6,676 కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న‌ 60 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందూపురం ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన బాల‌య్య‌