Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకుంటున్న భారత్... లక్ష సంఖ్య దిగువకు కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (10:47 IST)
భారత్ ఊపిరి పీల్చుకుంటుంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఇపుడు శాంతిస్తోంది. ఫలితంగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గడచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య లక్షకు దిగువకు చేరుకున్నాయి. 
 
అంటే 63 రోజుల త‌ర్వాత తొలిసారి ల‌క్ష క‌న్నా త‌క్కువ‌గా రోజువారీ కేసులు న‌మోద‌ు కావడం గమనార్హం. దేశంలో మొన్న‌ 1,00,636 క‌రోనా కేసులు నమోదు కాగా, సోమవారం 86,498 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.
 
ఆ ప్రకారంగా, సోమవారం 1,82,282 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,96,473కు చేరింది. మరో 2,123 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,51,309కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,73,41,462 మంది కోలుకున్నారు. 13,03,702 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 23,61,98,726 మందికి వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments