Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ 3 కరోనా బులిటెన్ : కొత్తగా 1.34 లక్షల కేసులు

Advertiesment
India
, గురువారం, 3 జూన్ 2021 (10:16 IST)
దేశంలో కొత్తగా మరో 1,34,154 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అలాగే, బుధవారం  ఒక్క రోజే 2,11,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,84,41,986కు చేరింది. మరో 2,887మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,37,989కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,63,90,584  మంది కోలుకున్నారు. 17,13,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 22,10,43,693 మందికి వ్యాక్సిన్లు వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 35,37,82,648 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 21,59,873 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవం.. సైకిల్ తొక్కితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?