Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం : ఒకే రోజులో 85 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:26 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిలో వేగం పెరిగింది. ఫలితంగా పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్రలో ఈ కేసుల పెరుగుల అధికంగా కనిపిస్తుంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 85 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కు చేరింది.
 
తాజాగా వెలుగు చూసిన కేసుల్లో అత్యధికంగా ఒక్క ముంబై మహానగరంలోనే 53 కేసులుగా ఉన్నాయి. పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్.ఐ.వి) పరిశోధనాశాలలో జరిపిన సీక్వెన్సింగ్ ఫలితాల్లో 47 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. 
 
అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లో 38 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఐఐఎస్ఈఆర్ నివేదికల్లో పాజిటివ్‌గా తేలిన 38 మందిలో ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పూణె ల్యాబ్‌లో బయటపడిన 47 కేసుల్లో 43 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా, మూడు మాత్రం కాంటాక్ట్ కేసులని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments