Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళా సర్పంచ్‌ దారుణ హత్య: వివస్త్రను చేసి గోనె సంచిలో..?

మహిళా సర్పంచ్‌ దారుణ హత్య: వివస్త్రను చేసి గోనె సంచిలో..?
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:31 IST)
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌ దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె వివస్త్రను చేసి సోమవారం మధ్యాహ్నం పొదల్లో పడేశారు.
 
మహారాష్ట్రలో మహిళా సర్పంచ్ దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె వివస్త్రను చేసి సోమవారం మధ్యాహ్నం పొదల్లో పడేశారు. వివరాల్లోకి వెళితే.. మహద్ తాలూకా బెలోషి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
స్థానిక యువకుడు రోడ్డుపక్కన విసిరివేయబడిన గోనె సంచిని గమనించి దానిని తనిఖీ చేయడానికి ముందుకు సాగాడు. మహిళ మృతదేహం నగ్నంగా ఉందని, గాయాల గుర్తులను గుర్తించాడు. దీంతో అతను గ్రామస్థులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు.
 
మహిళ స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 
 
మహిళపై లైంగిక వేధింపులకు గురైందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం నివేదికను అందజేశారని చెప్పారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు మొదలెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాను అతి ప్రధానమైన వ్యవసాయ ఎగుమతి కేంద్రంగా మలచాలంటే?