Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచ లింగాల వ‌ద్ద భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం, కారు సీజ్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:08 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కర్నూలు పట్టణ  శివారులో పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో భారీగా తెలంగాణా మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్ ఇ బి అడిషిన‌ల్ ఎస్పీ తుహీన్ సీన్హా ఆదేశాల మేరకు  గురువారం తెల్లవారు జామున సి ఐ మంజుల, యస్ ఐ రాముడు, సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం అలంపూర్ వైపు నుండి ఫోర్డ్ ఫియేస్ట కారు AP 28 DK 2491 ప‌ట్టుబ‌డింది. 
 
 
కారును ఆపి తనిఖీ చేయగా, అందులో కర్నూల్ పట్టణం ఒబుల్లయ్య నగర్ షరీన్ నగర్ కు చెందిన బండి సురేష్ బాబు (42)  తెలంగాణ రాష్ట్రం గద్వాల్ నుండి 7 బాక్సుల మద్యం కొనుగోలు చేసి కర్నూల్ కు తరలిస్తూ అధికారుల తనిఖీల్లో దొరికాడు. కారులో 108 అక్రమ తెలంగాణ ఫుల్ బాటిళ్లు మద్యం వున్న 7 కాటన్ బాక్స్ లు స్వాధీనం చేసుకున్నారు. 
 
 
వాటిని కర్నూల్ లో అమ్మ‌డానికి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల క్రితం ఇదే వ్యక్తి కారులో అక్రమ మద్యం తరలిస్తూ, పంచ లింగాల చెక్ పోస్ట్ వద్ద దొరికాడు. పట్టుకొన్న మద్యం బాటిళ్లును, కారును సీజ్ చేసి  కర్నూల్ పోలీసు స్టేషన్ కు అప్పగించినట్లు సి ఐ మంజుల తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు ఖాజా, జగన్నాథం, రంగ స్వామిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments