Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచ లింగాల వ‌ద్ద భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం, కారు సీజ్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:08 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కర్నూలు పట్టణ  శివారులో పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో భారీగా తెలంగాణా మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్ ఇ బి అడిషిన‌ల్ ఎస్పీ తుహీన్ సీన్హా ఆదేశాల మేరకు  గురువారం తెల్లవారు జామున సి ఐ మంజుల, యస్ ఐ రాముడు, సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం అలంపూర్ వైపు నుండి ఫోర్డ్ ఫియేస్ట కారు AP 28 DK 2491 ప‌ట్టుబ‌డింది. 
 
 
కారును ఆపి తనిఖీ చేయగా, అందులో కర్నూల్ పట్టణం ఒబుల్లయ్య నగర్ షరీన్ నగర్ కు చెందిన బండి సురేష్ బాబు (42)  తెలంగాణ రాష్ట్రం గద్వాల్ నుండి 7 బాక్సుల మద్యం కొనుగోలు చేసి కర్నూల్ కు తరలిస్తూ అధికారుల తనిఖీల్లో దొరికాడు. కారులో 108 అక్రమ తెలంగాణ ఫుల్ బాటిళ్లు మద్యం వున్న 7 కాటన్ బాక్స్ లు స్వాధీనం చేసుకున్నారు. 
 
 
వాటిని కర్నూల్ లో అమ్మ‌డానికి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల క్రితం ఇదే వ్యక్తి కారులో అక్రమ మద్యం తరలిస్తూ, పంచ లింగాల చెక్ పోస్ట్ వద్ద దొరికాడు. పట్టుకొన్న మద్యం బాటిళ్లును, కారును సీజ్ చేసి  కర్నూల్ పోలీసు స్టేషన్ కు అప్పగించినట్లు సి ఐ మంజుల తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు ఖాజా, జగన్నాథం, రంగ స్వామిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments