Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 24 గంటల్లో కొత్తగా 24,879 కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 9 జులై 2020 (11:20 IST)
ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం భారత్‌లో తన ఉగ్రరూపాన్ని దాల్చింది. దీనికి తోడుగా భారత్‌లో కొత్తగా మరో24,879 కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూ ఉన్నాయి.
 
గడిచిన 24 గంటల్లో 24,879 కేసులు నమోదు కాగా 487 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో మొత్తం 7,67,296 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 2,69,789 ఉండగా 4,76,377 మంది చికిత్సలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 21,129 మంది కరోనా వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,67,061 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,07,40,832 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments