Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 46 వేల కేసులో.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతం

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:01 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరోమారు పెరిగింది. కిందటి రోజుతో పోల్చితే ఈ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
 
తాజాగా 60,729 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మరో 817 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,03,62,848కు పెరిగింది. వైరస్‌ నుంచి మొత్తం 2,94,27,330 బాధితులు కోలుకున్నారు. 
 
ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 3,98,454 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 5,37,064కు చేరాయి. మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు 33,28,54,527 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. 
 
ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా ఉందని, ఇప్పటివరకు 41.01 కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments