Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యవసర వినియోగం : మోడెర్నా టీకాకు డీజీసీఏ అనుమతి!

Advertiesment
Moderna Vaccine
, బుధవారం, 30 జూన్ 2021 (07:58 IST)
అమెరికాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ మోడెర్నా దిగుమతికి భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌(డీసీజీఐ) అనుమతి వచ్చింది. ముంబైకి చెందిన సిప్లా కంపెనీకి 'పరిమిత అత్యవసర వినియోగం' కింద ఆ టీకాను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు. 
 
మోడెర్నా ఆగమనంతో భారత్‌లో అనుమతి పొందిన కొవిడ్‌ టీకాల సంఖ్య నాలుగుకు చేరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వీ టీకాలకు అనుమతి ఉంది. మోడెర్నా ఇప్పుడు నాలుగో టీకా. ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. 
 
కాగా.. తాము మోడెర్నా దిగుమతి కోసం సోమవారం డీసీజీఐకి అనుమతి చేసుకున్నామని, ఒక్కరోజులోనే అనుమతులు వచ్చాయని సిప్లా కంపెనీ వెల్లడించింది. తొలి 100 మంది లబ్ధిదారులకు సంబంధించి వారం రోజులకు సంబంధించి వారి ఆరోగ్య పరిస్థితిని డీసీజీఐకి సమర్పించాల్సి ఉంటుందని వివరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసుల వేధింపులు ఆపండి: డీజీపీ మహేందర్‌రెడ్డికి అసదుద్దీన్‌ లేఖ