Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీసుల వేధింపులు ఆపండి: డీజీపీ మహేందర్‌రెడ్డికి అసదుద్దీన్‌ లేఖ

పోలీసుల వేధింపులు ఆపండి: డీజీపీ మహేందర్‌రెడ్డికి అసదుద్దీన్‌ లేఖ
, బుధవారం, 30 జూన్ 2021 (07:56 IST)
బక్రీద్‌  పండుగ సందర్భంగా ముస్లింలు సంప్రదాయంగా బలిచ్చే గొర్రెలు-మేకలు, ఇతర జంతువులను రవాణా చేసే వ్యాపారులు, వాహనదారులను వేధింపులకు గురి చేయకుండా  పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.

జూలై 21న జరుగనున్న బక్రీద్‌ (ఈదుల్‌జుహా) రోజున ముస్లింలు మేక లేదా పొట్టేల్‌, ఎద్దులను బలి ఇవ్వడం సంప్రదాయమని వివరించారు.

బలి చేసేందుకు రాష్ట్రంలోని పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, పెంపుకందారులు విక్రయించేందుకు హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లోని నగరాలు, పట్టణ ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తుండగా కొంత మంది దాడులు చేసి బీభత్స పరిస్థితులను సృష్టించి, పోలీస్‌ స్టేషన్‌లకు అప్పగించడంతో పోలీసులు కేసులునమోదు చేస్తున్నారని ఆయన వివరించారు. ఇలాంటి సంఘటలనకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో భారత్‌ కు మోడెర్నా టీకా