Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోడీ.. భారత్‌కు అప్పగించొద్దంటూ...

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (09:53 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇపుడు లండన్ కోర్టును ఆశ్రయించాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 
 
గత రెండేళ్లుగా లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంటున్న నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోమారు లండన్ హైకోర్టును ఆశ్రయించాడు. 
 
గతంలోనూ ఓసారి అప్పీల్ చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈసారి తమ వాదనలను నేరుగా వినాలని నీరవ్ తరపు న్యాయవాదులు అప్పీలు చేశారు. దీంతో జులై 21న వాదనలు వినేందుకు న్యాయస్థానం అనుమతి నిచ్చింది.
 
కాగా, 19 మార్చి 2019 నుంచి జైలులోనే ఉంటున్న 50 ఏళ్ల నీరవ్.. పలుమార్లు పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను ‘ఫ్లైట్ రిస్క్’ను కారణంగా చూపిస్తూ కోర్టు తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ బంధువు మెహుల్ చోక్సీ ప్రస్తుతం డొమినికాలో పోలీసుల నిర్బంధంలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments