కోళ్లకు కొత్త వైరస్... కీసరలో చనిపోతున్నాయి.. రేట్లు పెరిగాయ్

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (09:51 IST)
వైరస్‌ల బాధ రోజురోజుకీ పెరిగిపోతుంది. మనుషులకే కాకుండా కోళ్ళకు కూడా కొత్త వైరస్ సోకింది. కీసరలో కోళ్లకు కొత్త వైరస్ సోకింది. దీంతో పౌల్ట్రీల్లో కోళ్లు చచ్చిపోతున్నాయి. కోళ్లు చనిపోవడంతో వ్యాపారులు చికెన్ ధరలను పెంచారు. 
 
మే నెలలో కిలో చికెన్ ధర రూ. 130 నుంచి 150 రూపాయలు ఉంది. గత 15 రోజులుగా చికెన్ కేజీ రూ.200లకు పైగా అమ్ముతున్నారు. గత కొన్ని రోజులుగా కోళ్లు అంతుచిక్కని రోగాలతో చనిపోతున్నట్లు ఫౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.
 
దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. కనీస ఖర్చులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ రేట్ పెరగడంతో కోళ్ల ట్రాన్స్ పోర్టు ఖర్చులు పెరిగాయని, అటు కొత్త వైరస్ టెన్షన్ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కోళ్లలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే కోళ్లు, పశువుల్లో వైరస్‌లు సహజమని పశువైద్యులు కొట్టి పారేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments