Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోళ్లకు కొత్త వైరస్... కీసరలో చనిపోతున్నాయి.. రేట్లు పెరిగాయ్

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (09:51 IST)
వైరస్‌ల బాధ రోజురోజుకీ పెరిగిపోతుంది. మనుషులకే కాకుండా కోళ్ళకు కూడా కొత్త వైరస్ సోకింది. కీసరలో కోళ్లకు కొత్త వైరస్ సోకింది. దీంతో పౌల్ట్రీల్లో కోళ్లు చచ్చిపోతున్నాయి. కోళ్లు చనిపోవడంతో వ్యాపారులు చికెన్ ధరలను పెంచారు. 
 
మే నెలలో కిలో చికెన్ ధర రూ. 130 నుంచి 150 రూపాయలు ఉంది. గత 15 రోజులుగా చికెన్ కేజీ రూ.200లకు పైగా అమ్ముతున్నారు. గత కొన్ని రోజులుగా కోళ్లు అంతుచిక్కని రోగాలతో చనిపోతున్నట్లు ఫౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.
 
దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. కనీస ఖర్చులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ రేట్ పెరగడంతో కోళ్ల ట్రాన్స్ పోర్టు ఖర్చులు పెరిగాయని, అటు కొత్త వైరస్ టెన్షన్ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కోళ్లలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే కోళ్లు, పశువుల్లో వైరస్‌లు సహజమని పశువైద్యులు కొట్టి పారేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments