Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (09:36 IST)
అసలే కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పిడుగులాంటి వార్తను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను రెండు వారాలపాటు రద్దు చేసింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గణనీయమైన స్థాయిలో తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం - కాచిగూడ, (08561) రైలును రేపటి నుంచి జులై 14వ తేదీ వరకు, కాచిగూడ - విశాఖపట్టణం (08562) రైలును జులై 2 నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం - కడప (07488) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, కడప - విశాఖపట్టణం (07487) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం - లింగంపల్లి (02831) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, లింగంపల్లి - విశాఖపట్టణం (02832) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments