దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (11:52 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా ఈ వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కేవలం 795 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి 1280 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 58 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12054 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,29,839కు చేరింది. 
 
ఇందులో 4,24,96,369 మంది కోలుకున్నారు. మహమ్మారితో 5,21,416 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.17 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments