Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని అవుతారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Advertiesment
AP Dy CM Narayana Swamy
, శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో 15 యేళ్ల తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి అవుతారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జోస్యం చెప్పారు. 
 
ఆయన శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దైవానుగ్రహం, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. అన్ని అంశాలు అనుకూలిస్తే మరో 15 యేళ్ళ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
అదేసమయంలో త్వరలో సీఎం జగన్ చేపట్టనున్న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ, మంత్రిపదవుల కేటాయింపు అంశాన్ని సీఎం చూసుకుంటారన్నారు. తమకు పదవులు ముఖ్యంకాదనీ, పదవులు వున్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ.. జస్టిస్ ఎన్వీ రమణ