Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకకు చేయూతనిచ్చిన భారత్... అప్పుగా 40 వేల టన్నుల డీజిల్‌

శ్రీలంకకు చేయూతనిచ్చిన భారత్... అప్పుగా 40 వేల టన్నుల డీజిల్‌
, శనివారం, 2 ఏప్రియల్ 2022 (12:55 IST)
శ్రీలంకకు భారత్ చేయూతనిచ్చింది. ఇంధన కొరతతో నానా తంటాలు పడుతున్న శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్‌ను అప్పుగా సరఫరా చేసింది. భారత్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకుంది. దీనిని సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. 
 
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ.. ఆరు వేల టన్నుల డీజిల్‌ను అందించనుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 
 
శ్రీలంక రవాణారంగంలో బస్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో మూడింటా రెండొంతుల వాహనాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. వాటికి సరిపడా డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. 
 
దీంతో రాజపక్స ప్రభుత్వం భారత్‌ సాయం కోరింది. కాగా, దేశంలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తుండటంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్‌భవన్‌‌లో ఉగాది వేడుకలు: సీఎం కేసీఆర్‌ సహా టీఆర్ఎస్‌ నేతలు దూరం