Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గిన కోవిడ్ కేసులు - పెరిగిన రికవరీ రేటు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:33 IST)
దేశంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 58,077 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,25,36,137కు చేరింది. ఈ కేసుల్లో 4,13,31,158 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 6,97,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,177 మంది కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు. 
 
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1,50,407 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని, మరో 657 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ  వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments