Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లీటరు పెట్రోల్‌పై రూ.8-9 మేరకు బాదుడు... ఎప్పటి నుంచి...

లీటరు పెట్రోల్‌పై రూ.8-9 మేరకు బాదుడు... ఎప్పటి నుంచి...
, గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:43 IST)
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల తర్వాత దేశంలో భారీగా పెట్రోల్, డీజల్ ధరల బాంబు పేలనుంది. లీటరు పెట్రోలుపై రూ.8 నుంచి రూ.9 మేరకు పెరగనుంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ధరలను పెంచేందుకు చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని డెలాయిట్ టచీ తోమత్సు ఇండియా సంస్థ భాగస్వామి దేబాశిష్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు చుమురు, గ్యాస్ధరల్లో ఎలాంటి మార్పులేదు.
 
అయితే, ఇపుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో పెట్రోల్ ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేక వస్తుందని భావించి చమురు కంపెనీలు ఈ పెట్రోల్ ధరల జోలికి వెళ్లడంలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 14 అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష