Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం.. 24గంటల్లో 904మంది మృతి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:57 IST)
భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రెండవ విడతలో రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోసారి లక్షదాటాయి రోజువారి కేసుల సంఖ్య... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గడచిన 24 గంటలలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఇదే సమయంలో 904 మంది కన్నుమూశారు. ఇక, 75,086 మంది కోలుకున్నారు.
 
దీంతో.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకోగా... కోలుకున్నవారి సంఖ్య 1,21,56,529కు పెరిగింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 12,01,009గా ఉండగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,70,179కు పెరిగింది.
 
దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 89.86 శాతంగా ఉన్నట్టు బులెటిన్‌లో కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.88 శాతంగా ఉండగా... మరణాల రేటు 1.26 శాతంగా ఉంది. మరోవైపు.. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన 'కరోనా' నిర్దారణ పరీక్షల సంఖ్య 11,80,136గా ఉందని.. ఇదే సమయంలో 29,33,418 మంది వ్యాక్సినేషన్‌ అందించినట్టు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments