Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాటుకు ఆఫ్రికా ఎస్వాతినీ దేశ ప్రధాని మృతి

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (15:18 IST)
కరోనా కాటుకు ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం 12 లక్షల జనాభా కలిగిన ఆఫ్రికా దేశమైన ఎస్వాతినీలో ఇప్పటివరకు 6,768 కరోనా కేసులు నమోదవగా, 127 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

తాజాగా ఆఫ్రికాలోని ఎస్వాతినీ అనే దేశానికి ప్రధాన మంత్రి ఆంబ్రోసో మాండ్వులో లామిని (52) కరోనాతో మృతిచెందారు. నాలుగు వారాల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్వాతినీ ఉపప్రధాని థెంబా మసుకు ఒక ప్రకటనలో తెలిపారు. 
 
కరోనాకు మెరుగైన చికిత్స నిమిత్తం డిసెంబర్‌ 1న ఆంబ్రోస్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు. అయితే పరిస్థితి విషమించి ఆదివారం అర్థరాత్రి మరణించారని అన్నారు. కాగా, అతిచిన్న దేశమైన ఎస్వాతినిలో సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉంది. 2018లో ఆయన ఎస్వాతినీకి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది పోలాండులోని కటోవిస్‌ నగరంలో జరిగిన ప్రపంచ సదస్సులో వాతావరణ మార్పులపై ఆంబ్రోస్‌ ప్రసంగించారు. అంతకుముందు ఆయన బ్యాంకింగ్‌ రంగంలో పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments