Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాటుకు ఆఫ్రికా ఎస్వాతినీ దేశ ప్రధాని మృతి

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (15:18 IST)
కరోనా కాటుకు ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం 12 లక్షల జనాభా కలిగిన ఆఫ్రికా దేశమైన ఎస్వాతినీలో ఇప్పటివరకు 6,768 కరోనా కేసులు నమోదవగా, 127 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

తాజాగా ఆఫ్రికాలోని ఎస్వాతినీ అనే దేశానికి ప్రధాన మంత్రి ఆంబ్రోసో మాండ్వులో లామిని (52) కరోనాతో మృతిచెందారు. నాలుగు వారాల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్వాతినీ ఉపప్రధాని థెంబా మసుకు ఒక ప్రకటనలో తెలిపారు. 
 
కరోనాకు మెరుగైన చికిత్స నిమిత్తం డిసెంబర్‌ 1న ఆంబ్రోస్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు. అయితే పరిస్థితి విషమించి ఆదివారం అర్థరాత్రి మరణించారని అన్నారు. కాగా, అతిచిన్న దేశమైన ఎస్వాతినిలో సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉంది. 2018లో ఆయన ఎస్వాతినీకి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది పోలాండులోని కటోవిస్‌ నగరంలో జరిగిన ప్రపంచ సదస్సులో వాతావరణ మార్పులపై ఆంబ్రోస్‌ ప్రసంగించారు. అంతకుముందు ఆయన బ్యాంకింగ్‌ రంగంలో పనిచేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments