Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా దూకుడు : తగ్గని పాజిటివ్ కేసులు - మరణాలు సంఖ్య

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (11:04 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు కొనసాగుతూనేవుంది. అయితే, వారం రోజుల క్రితంతో పోల్చితే ఇపుడు కాస్త మెరుగు అనిపిస్తోంది. ఎందుకంటే.. వారం రోజుల క్రితం ప్రతి రోజూ 60 వేలకు పైగా కేసులు నమోదవుతూ వచ్చేవి. కానీ, ఇపుడు 55 వేలకు పడపోయాయి. గత 24 గంటల్లో 55,079 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 876 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,02,743కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 51,797కి పెరిగింది. ఇక 6,73,166 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,77,780 మంది కోలుకున్నారు. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,682 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,070  మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఆసుపత్రుల్లో 21,024 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 72,202 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 711 కి  చేరింది. జీహెచ్‌ఎంసీలో 235 మందికి కొత్తగా కరోనా సోకింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments