Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య
, సోమవారం, 17 ఆగస్టు 2020 (22:35 IST)
గౌరవ రాజ్యసభ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు, కార్యకర్త నుండి ప్రధాన కార్యదర్శుల వరకు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, కోటా నుండి కోలకతా వరకు, సెర్చ్ ఇంజిన్లో టాప్, ట్రెండింగ్‌లో హిస్టరీ, ఆల్ ఇండియాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఇలా ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు.
 
ఇందులో భాగంగా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గచ్చిబౌలి లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ... మనకు జీవించటానికి భూమి ఒక్కటే ఆధారం, మనకు వేరే ఆధారం ఇప్పటివరకు లేదు, అలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలి.
 
మన అవగాహనా లోపంతో మనం మొక్కలు నాటడం అశ్రద్ధ చేస్తున్నాం కానీ అలా చేయకుండా ఈ ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలి అని, ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా... ఈ కార్యక్రమం ఇలానే ముందుకు కొనసాగడానికి నా వంతుగా మరో ముగ్గురు యాక్టర్ సుశాంత్, డైరెక్టర్ శివ నిర్వాణ, నటి రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ గార్లని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి నామినేషన్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డి Chennaiలో వున్నందుకే అలా ప్రచారం జరుగుతోందట