Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్ లైన్స్ విడుదల: మార్గదర్శకాలు ఇవే

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (22:33 IST)
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. దేశంలో రోజుకు 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే జీవన విధానం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అక్టోబరు 15 నుంచి అమల్లోనికి రానున్న అన్ లాక్ 5 మార్గదర్శకాలను పది రోజుల క్రిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ఇందులో దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది.గైడ్ లైన్స్ ప్రకారం రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు,భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.
 
కోవిడ్ నిబంధనలు కచ్చితంగా ప్రజా రవాణాలో పాటించాలని తెలిపింది. అలాగే గుళ్లు, చర్చీలు, మసీదులలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజర్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశాయి. విద్యాసంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట్ల కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments