Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 45వేలకు చేరిన కరోనా మృతుల సంఖ్య.. దేశంలోనూ..?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (21:14 IST)
మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 45వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,959 పాజిటివ్‌ కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,14,273కు, మరణాల సంఖ్య 45,115కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 6,748 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,69,090కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 99,151 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.
 
దేశంలో కరోనా కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా గణనీయంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 577 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 1,25,562 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 50,357 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 84,62,081కు చేరింది. గడిచిన 24 గంటల్లో 53,920 కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 78,19,887 కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments